మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా లో చిరు డబుల్ రోల్ లో నటిస్తున్నారని టాక్.. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ చిత్రం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. అయితే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆచార్య షూటింగ్ను పూర్తి చేస్తారు.
ఈ సినిమా తర్వాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో ఈ పాత్రను సూపర్స్టార్ మోహన్లాల్ పోషించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. కానీ చిరంజీవి ఇమేజ్, ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెలుగులో హీ రోయిన్ ఉండేలా స్క్రిప్ట్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ‘సాహో’ దర్శకుడు సుజిత్ స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో సుజిత్తో చిరంజీవితో స్క్రిప్ట్కు సంబంధించిన చర్చ జరుపుతారట. రామ్చరణ్తో మరో నిర్మాత ఈ రీమేక్ను నిర్మిస్తారని టాక్.