లాక్ డౌన్ కారణంగా ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా కారణంగా షూటింగ్‌లకు విరామం దొరకడంతో నిత్యం బిజీ షెడ్యూల్‌తో ఉండే సెలబ్రిటీలంతా ఇంట్లో కుటంబంతో గడుపుతున్నారు. ఇంటిని శుభ్రం చేయడం, వంటలు చేయడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, గతకాలపు జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటివి చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాక్‌డౌన్‌లో రోజూవారి షెడ్యూల్‌ను అభిమానులతో పంచుకున్నారు. అలాగే ఈ లాక్‌డౌన్‌ తనలో తెచ్చిన మార్పులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

 

‘నా జీవితంలో ఎప్పుడు ఇన్ని రోజులు ఇంట్లో ఉండలేదు. ఇదే నాజీవితంలో సుదీర్ఘకాల విరామం. చిన్నప్పుడు వేసవికాలం సెలవుల్లో కూడా ఇన్ని రోజులు ఒకచోట లేను. ఇంతకాలం ఇంట్లో ఉండటం అనేది ఒక కొత్త అనుభూతి’  అని నేను అనుకుంటున్నాను అన్నారు ర‌కుల్‌..  ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచిద‌ని, ఎందుకంటే ఇది మీతో మీరు కనెక్ట్‌ అయ్యే సమయం. నేను ప్రసస్తుతం పర్సనల్‌ డెవలప్‌మెంట్‌కు అధిక సమయం కేటాయిస్తున్నాను ప్రతి ఒక్కరూ  క‌రోనా మహమ్మారి నుంచి బయటపడాలని, ఆనందంగా జీవించాలని కోరుకోండి ’  అని ర‌కుల్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: