బాలీవుడ్ లో చిన్న పాత్రల్లో కనిపించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత హీరో రేంజ్ కి ఎదిగాడు.  విలన్ గా తన కెరీర్ లో పలు చిత్రాల్లో నటించాడు. తెలుగు లో మహేష్ బాబు నటించిన ‘సైనికుడు’ చిత్రంలో విలన్ గా నటించాడు ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ తన నటనలో ఎంతో నేచురాలిటీ చూపిస్తుంటారు. హాలీవుడ్ లో కూడా నటించాడు.  కళా రంగంలో కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం అతనికి 2011 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది  ఇటీవల ఆయన అనారోగ్యంతో సిని పరిశ్రమకు దూరమైన విషయం తెలిసిందే.

 

 తాజాాగా ఇర్ఫాన్ ఇంట విషాదం చోటు చేసుకుంది.  ఇర్ఫాన్ తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూసింది. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీలో ఆమె నివసిస్తున్నారు. సహజ కారణాలతోనే సైదా బేగం కన్నుమూశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: