ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం దాల్చింది. కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అంతకంతకూ కేసులు బయటపడు తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1097కు చేరుకున్నట్లు పేర్కొంది.
కొత్తగా కృష్ణా జిల్లాలో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో 12, కర్నూల్ లో 4, కడపలో 3, గుంటూరులో 3, తూర్పు గోదావరిలో 2, అనంతపురంలో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా బారినపడి 31 మంచి మరణించగా, 231 మంది కోలుకున్నారు. 835 మంది ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.