ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో లక్షలాది మంది వలస కూలీలు ఉన్నారు. వీరు సొంత రాష్ట్రాలకు వెళ్లలేక తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. అటు పనులు కూడా లేకపోవడంతో పస్తులు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మీ చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు.. 040-2111 1111 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు.. తామే వచ్చి ఆహారాన్ని అందిస్తారు. ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కార్యాలయం చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకలిగా ఉన్న వారిని ఆదుకునేందుకు వీలుగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్.. మాజీ ఎంపీ కవిత ఈ వినూత్న కార్యక్రమానికి తెర తీశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple