నవ మాసాలు మోసి కని పెంచించిన తల్లి కాస్తకూడా విచక్షణ లేకుండా మరిది పై కోపంతో తన సొంత బిడ్డలకే విషమిచ్చి చంపిన దుర్ఘటన తిరుచ్చి జిల్లా కముదిరం ప్రాంతంలో చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా కముదిరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలను వున్నారు. కొద్దిరోజుల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి అత్తవారింట్లోనే ఉంటోంది. అయితే తన అతింట్లో ఉంటున్న సమయంలో ఈనెల 19వ తారీఖున ఆమె మరిది రూ.2000 కనిపించక పావడంతో తన ఇంట్లో వారందరిని వరుసబెట్టి తిట్టేసి వెళ్లి పోయాడు.

 

దానితో తీవ్ర మస్తాపానికి గురైన ఆ మహిళ మరిది తనపై అనుమానం తోనే తిట్టాడనుకున్నఆమె తన ఇద్దరు కూతుళ్ళకు విషం ఇచ్చి ఏమి తెలియనట్టు ఉందిపోయింది. పిల్లల నొట్లొనుండి నురగలు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు బాలికలు శుక్రవారం చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పిల్లలను చంపడానికి మరిదే కారణమా లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: