ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాటంలో నిమగ్నమైంది. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతోంది. అయితే.. ఇదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రం భారత్లోకి చొరబడేందుకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్లోయలోకి చొరబడేందుకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని భారత సైన్యం చెప్పడం కలకలం రేపుతోంది. అయితే.. ఉగ్రమూక చొరబాట్లను నిలువరించేందుకు సరిహద్దుల వెంట నిఘాను పటిష్టంచేశామని లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. సరిహద్దుల వెంట బలగాల పహారాను పెంచినట్లు తెలిపారు. ఈ ఉగ్రవాదులు కశ్మీర్లోయలోకి కరోనాను కూడా మోసుకొచ్చే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని అన్నారు.
నిజానికి.. చాలా రోజులుగా భారత్పై నేరుగా పోరాడలేని పాకిస్తాన్.. పరోక్షంగా బయోవార్కు దిగేందుకు కసరత్తు చేస్తోందని, కరోనా వైరస్ సోకిన ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు కుట్రలు చేస్తోందని వాదన బలంగా వినిపిస్తోంది. కరోనా వైరస్ సోకిన ఉగ్రవాదులను భారత్లోకి పంపి.. వైరస్ను వ్యాప్తి పెంచి, భారత్ను దెబ్బకొట్టేందుకు పాక్ కుట్రలు చేస్తున్నట్లు ఇప్పటికే ఇంటెలిజెన్స్వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పీవోకే 300మంది ఉగ్రవాదులు ఉన్నట్లు భారత సైన్యం చెప్పడం గమనార్హం.