దేశంలో కరోనా వైరస్పై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ సోమవారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో మే 3వ తేదీ తరువాత లాక్డౌన్ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై ప్రధానంగా చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చిస్తారని అంటున్నాయి. ప్రధానంగా లాక్డౌన్ కారణంగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ దారిలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కేంద్రం, పలు రాష్ట్రాలు లాక్డౌన్కు పలు రంగాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.
హాట్స్పాట్లు కాని నివాస ప్రాంతాల్లోనూ మినహాయింపులూ ప్రకటించాయి. దీంతో స్థానికంగా ఉన్న దుకాణాలు తెరుచుకుంటున్నాయి. అయితే.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో కరోనా కట్టడికి లాక్డౌన్ మరి కొన్ని రోజులు కొనసాగించడమే మేలని ఇప్పటికే పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. గత మార్చి 20, ఏప్రిల్ 11 తేదీల్లోనూ ప్రధాని నరేంద్రమోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.