క‌రోనా వైరస్‌ సోకి మృతి చెందిన భారతీయుల సంఖ్య భారత్‌లో కన్నా బ్రిటన్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్‌లో సోమవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,569కి చేరుకోగా.. 23,319 మంది మృతిచెందారు. వీరిలో బ్రిటన్‌ పౌరుల కన్నా వివిధ దేశాల నుంచి వలసలకు వచ్చిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. వైరస్‌ కారణంగా బ్రిటన్‌లో వెయ్యికిపైగా భారత్‌ నుంచి వలస వెళ్లిన వాళ్లు మరణించి ఉంటారని అక్కడి అధికారులు వెల్ల‌డిస్తున్నారు.

 

కానీ అక్కడి భారతీయుల మరణాలపై స్థానిక ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో వైపు వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వైరస్‌ను మాత్రం అదుపుచేయలేకపోయింది. ఏకంగా ఆదేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా అర్థమవుతోంది. దేశంలో నమోదైన కరోనా బాధితుల్లో 40 శాతం మంది మైనార్టీల జానాభాకు చెందిన వారేనని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక 40 శాతం ఐసీయూల్లోనూ వారే ఉన్నారని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: