కరోనా వైరస్ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. వేలాది మంది పనులు లేక రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పేదల ఆకలి మాత్రం తీరడం లేదు. దీనితో ఎవరికి వారుగా తమ వంతు సహాయం చేస్తున్నారు. 

తాజాగా యువ హీరో నిఖిల్ అభిమానులు తమ వంతు సహాయం చేసారు. పేదలకు తమ వంతుగా కూరగాయలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అయిన అమరావతిలో ఈ విధంగా సహాయం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: