ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ ని లక్ష్యంగా చేసుకుంటూ కామెంట్ లు చేసారు. టీడీపీ నేతల తీరుని ఆయన ట్విట్టర్ లో తీవ్రంగా తప్పుబట్టారు. వరదలొస్తాయని సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని...
సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలన్నారు. కరోనా విషయంలో కూడా యనమల, కళా లాంటి కాలం చెల్లిన మేధావులు ‘వరద ముంపు’ తరహా విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వరదలొస్తాయని సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి. కరోనా విషయంలో కూడా యనమల, కళా లాంటి కాలం చెల్లిన మేధావులు ‘వరద ముంపు’ తరహా విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2020