టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. స్టార్ హీరోలు ఈ విష‌యంలో ముందు ఉంటున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ ఇప్ప‌టికే అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు నుంచి ఇటు రామ్ లాంటి యంగ్ హీరోతో సైతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మ‌రో అదిరిపోయే కాంబినేష‌న్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో బడా మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ ముగ్గురితో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

 

ఇందుకోసం ఆయ‌న త్రివేణి సంగమం అనే టైటిల్‌ను కూడా అనుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న కెరీర్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా దీనిని తెర‌కెక్కించాల‌ని అనుకున్నా అది సాధ్యం కాక‌పోవ‌డంతో అప్పుడు రాఘవేంద్ర‌రావు బ‌న్నీ హీరోగా గంగోత్రి సినిమా తీశారు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురితో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయాల‌న్న కోరిక నేప‌థ్యంలోనే క‌థ రెడీ చేసిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి.

 

ఈ ముగ్గురి హీరోల‌తో సినిమా అంటూ ప‌ట్టాలెక్కితే అది ఖ‌చ్చితంగ క్రేజీ కాంబో అవుతుంది అన‌డంలో సందేహం లేదు. 2017లో నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఆ తరువాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: