బాలీవుడ్ అగ్ర హీరో అక్ష‌య్ కుమార్ మ‌రో సారి త‌న దాతృత్వం చాటుకున్నారు. కరోనాపై పోరాటానికి ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రూ.28 కోట్ల విరాళాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో రూ.2 కోట్ల‌ను విరాళంగా ప్ర‌క‌టించి ఔదార్యం చాటుకున్నారు అక్ష‌య్‌. ఈ అగ్ర హీరో ఈ సారి త‌న విరాళాన్ని ముంబై పోలీస్ శాఖ‌కు అందిస్తున్న‌ట్లు తెలిపారు. 

 

ఈమేర‌కు అక్ష‌య్‌కు ముంబై పోలీస్ శాఖ  ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. దీనిపై అక్ష‌య్ స్పందిస్తూ.. ‘‘క‌రోనాపై పోలీసులు ప్రాణాల‌ను ఒడ్డి పో రాడుతున్నారు. ఈ పోరాటంలో హెడ్ కానిస్టేబుల్స్ చంద్ర‌కాంత్ పెందుర్క‌ర్‌, సందీప్ సుర్వే త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. పోలీసుల వ‌ల్లే మేం భ ద్ర‌త‌గా ఉన్నామ‌ని మ‌ర‌చిపోకండి. నా వంతు బాధ్య‌త‌ను నేను నిర్వ‌ర్తించాను. మీరు కూడా చేస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు. అక్షయ్ పెద్ద మనసు చూ స్తున్న నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అక్షయ్ రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో అని కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: