ఏప్రిల్ 28.. ఈరోజు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఎంతో ప్ర‌త్యేకం.. ఆయ‌న కెరీర్‌లో రెండు పండుగ‌ల‌ను ఒకేసారి తీసుకొచ్చిన రోజు. ఏమిటా పండుగ‌ల‌ని అనుకుంటున్నారా.. ఒక‌ట అడ‌విరాముడు సినిమా విడుద‌ల అయిన రోజు.. బాహుబ‌లి-2 విడుద‌ల అయిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ చేశారు. 43 ఏళ్ల క్రితం విడుద‌ల అయిన అడ‌విరాముడు సినిమా, బాహ‌బ‌లి-2 సినిమాల గురించి అందులో అద్భుతంగా చెప్పారు.

 

* నా జీవితంలో మ‌రుపురాని రోజు.. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావుగారితో నా సినిమా ప్ర‌స్థానం మ‌రో మెట్టు ఎక్కిన రోజు. సినీ ప్ర‌పంచంలో ఉన్న రికార్డుల‌ను తిర‌గ‌రాసి.. కొత్త‌రికార్డులకు శ్రీ‌కారం చుట్టిన రోజు.. ఒక్క మాట‌లో చెప్పాలంటే అది చ‌రిత్ర సృష్టించిన రోజు.. 43ఏళ్ల క్రితం అడ‌విరాముడు విడుద‌ల అయిన రోజు* అంటూ రాఘ‌వేంద్ర‌రావు ట్వీట్ చేశారు. *బంగారానికి తావి అబ్బిన‌ట్టు నా స‌మ‌ర్ప‌ణ‌లో ఏప్రిల్ 28 నాడే బాహుబ‌లి-2 చిత్రం విడుద‌ల కావ‌డం నాకు మ‌రింత ఆనందాన్ని క‌లిగిస్తోంది. అడ‌విరాముడు ఆహా అనిపిస్తే.. బాహుబ‌లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాహో అనిపించింది* అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: