గుంటూరు జిల్లాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది.  గ‌డిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా మరో 17  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొ త్తం కేసుల సంఖ్య 254కు చేరింది. ఇప్ప‌టికే క‌రోనా బారిన‌ప‌డి 8 మంది మృతి చెందారు. దీంతో అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యారు.  జిల్లా క లెక్టర్ శామ్యూల్‌ ఆనందకుమార్‌ నరసరావుపేటలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. 

 

రేపు, ఎల్లుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలంతా సహకరించాల ని ఆయ‌న విజ్క్ష‌ప్తి చేశారు.  ‘ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అత్యవసరమైనవి తప్ప మరెలాంటి కేసులు చూడటానికి వీల్లేదు. క్వారంటైన్ సెంటర్లలో మంచి ఆహారం అందిస్తున్నాం. ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. లాక్ డౌన్ ఉల్లంఘించినవారిని జైలుకు పంపుతున్నాం’అని శామ్యూల్ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. 

 

గుంటూరు జిల్లాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది.  గ‌డిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా మరో 17  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొ త్తం కేసుల సంఖ్య 254కు చేరింది. ఇప్ప‌టికే క‌రోనా బారిన‌ప‌డి 8 మంది మృతి చెందారు. దీంతో అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యారు.  జిల్లా క లెక్టర్ శామ్యూల్‌ ఆనందకుమార్‌ నరసరావుపేటలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. 


 


రేపు, ఎల్లుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలంతా సహకరించాల ని ఆయ‌న విజ్క్ష‌ప్తి చేశారు.  ‘ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అత్యవసరమైనవి తప్ప మరెలాంటి కేసులు చూడటానికి వీల్లేదు. క్వారంటైన్ సెంటర్లలో మంచి ఆహారం అందిస్తున్నాం. ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. లాక్ డౌన్ ఉల్లంఘించినవారిని జైలుకు పంపుతున్నాం’అని శామ్యూల్ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. 


 


 

మరింత సమాచారం తెలుసుకోండి: