ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇది వ‌రకు ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను చెల్లిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని   జగన్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 2020-21కి సంబంధించి ప్ర‌తి త్రైమాసికం పూర్త‌యిన త‌ర్వాత త‌ల్లుల ఖాతాల్లోనే నేరుగా న‌గ‌దు జ‌మ చేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

 

ఇంతకు ముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంత వరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్‌ గుర్తుచేశారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన.... పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 కోట్లకుపైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అందజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: