నిర్మాత మరియు దర్శకుడు  'పంచ్' భారత్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘సేథితాల్’  కోసం పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ల మధ్య అతని కుమార్తె యువరాణి ఏప్రిల్ 26వ తేదీన.. ఆదివారం రోజు పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్య బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఆనందన్, మహేశ్వరి దంపతుల ముద్దుల కుమారుడు   భువనేష్  ను 'పంచ్' భారత్ కుమార్తె యువరాణి వివాహం చేసుకున్నారు. అయితే  పెళ్లిని అట్టహాసంగా చేయాలని అందరూ భావించారు కానీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున, ఈ పెళ్లి వేడుకకు దగ్గరి బంధువులు మాత్రమే ఈ వివాహాన్ని జరిపించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

IHG's daughter gets married during lockdown

 

లాక్ డౌన్ తర్వాత స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా ఫంక్షన్ ను  ఏర్పాటు చేయనున్నట్లు వధూవరుల తల్లిదండ్రులు  సంతోషంగా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సినిమా స్టార్లు మరియు సెలబ్రిటీలు వివాహం చేసుకున్న దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వర్క్ ఫ్రంట్ లో, పంచ్ భారత్ కూడా ముఖ్యమైన స్థానం కోసం రాబోయే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారని అభిమాన వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఇండియన్ హెరాల్డ్ గ్రూప్ నుండి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: