క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. రోజురోజుకూ వైర‌స్ కేసులు పెరిగిపోతున్నాయి. అనేక దేశాల్లో భార‌తీయులు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. యూర‌ప్‌దేశాలు, అమెరికా, గ‌ల్ఫ్ త‌దిత‌ర దేశాల్లో భార‌తీయులు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. అయితే.. సింగ‌పూర్‌లో క‌రోనా బారిన‌ప‌డిన భార‌తీయుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. సింగపూర్‌లో మంగళవారం కొత్తగా 528 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో కేవలం 8 మంది మాత్రమే సింగపూర్‌ దేశీయులు కావడం గమనార్హం. మిగ‌తావారందూ ఇత‌ర దేశాల‌కు చెందిన వారే.

 

ప్ర‌స్తుతం ఆదేశంలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 14,951కు చేరింది. వివిధ‌ డార్మిటరీల్లో నివసిస్తున్న 323,000 మంది వలస కార్మికుల్లో 12,183 మంది వైరస్‌ బారినపడ్డారు. ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ఈ ప్రాంతాలను అధికారులు హాట్‌స్పాట్‌గా  గుర్తించారు. అయితే.. సింగపూర్‌లో ఇప్పటి వరకు 2300 మందికి పైగా భారతీయులకు వైరస్‌ సోకిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వారిలో ఎక్కువ మంది డార్మిటరీల్లో నివసిస్తున్నవారే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: