మొన్నటి వరకు తెలంగాణ ప్రజలందరూ భయపడినప్పటికీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకం. ఎందుకంటే మొన్నటి వరకు భారీ సంఖ్యలో నమోదైన కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం గురించి వివరాలు వెల్లడించారు. ఇవాళ ఒక్క రోజే కొత్తగా 42 మంది కరోనా  వైరస్ బారి నుంచి చికిత్స పొందుతూ కోలుకున్నట్లు  ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇవాళ కేవలం కొత్తగా 6  వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ఈ  మహమ్మారి వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కోరుకున్నవారు 374 మంది అని ఈటెల రాజేందర్ తెలిపారు. క్రమక్రమంగా కరోనా  వైరస్ పై విజయం సాధిస్తున్నామని  ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈటెల రాజేందర్ సూచించారు.నిన్న  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఏడు పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ రోజుకు ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: