*బీ ద రియ‌ల్ మ్యాన్* చాలెంజ్ ఆరంభ శూర‌త్వంలాగే కొన‌సాగింది. టాలీవుడ్‌లో ఈ ఛాలెంజ్‌తో తెగ‌హ‌డావుడి చేసిన సెల‌బ్రిటీలు రెండుమూడు రోజులుగా పెద్ద‌గా స్పందించ‌డం లేదు. లాక్‌డౌన్ కార‌ణంగా అందరూ ఇంటి పట్టునే ఉండటంతో మహిళలపై పని భారం పెరుగుతోంది. ఈ మేరకు మగవాళ్లు కూడా మహిళలకు ఇంటి పనుల్లో సాయం చేయాలని, నిజమైన మనిషి అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు. మొద‌ట్లో సెల‌బ్రిటీలు బాగానే స్పందించారు. స్టార్ హీరోలంద‌రూ ఇందులో పాల్గొన్నారు. ఇంటి ప‌నులు చేసి వీడియోల‌ను షేర్ చేశారు.

 

జూనియ‌ర్ ఎన్టీఆర్,‌ చిరు, వెంక‌టేశ్ త‌దిత‌రులు ఇంటి ప‌నులు చేసి బీ ద రియ‌ల్ మ్యాన్ అని అనిపించుకున్నారు. అయితే.. మెగాస్టార్ చిరు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్, మణిరత్నం, రజినీలకు సవాల్ విసిరాడు. అయితే.. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. చిరు ట్వీట్‌కు కనీసం స్పందించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక రజినీ, మణిరత్నంలు కూడా స్పందించ‌లేదు. అయితే.. క‌రోనా వైర‌స్‌పై పోరులో నిమ‌గ్న‌మైన కేటీఆర్‌.. తీరిక‌లేక‌నే చిరు స‌వాల్‌ను స్వీక‌రించ‌లేదనే టాక్ వినిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: