తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో గత మూడు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పై ఇజ్రాయిల్  అనే వ్యక్తి చెప్పుతో దాడి చేయడం ఆంధ్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. వైయస్సార్సీపి పార్టీకి చెందిన ఇజ్రాయిల్ తోట త్రిమూర్తులు పై చెప్పుతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే తాజాగా తోట త్రిమూర్తులు పై చెప్పుతో దాడికి యత్నించిన ఇజ్రాయిల్ పై  హత్యాయత్నం చేశారు గుర్తుతెలియని దుండగులు. కే గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో చెరువు కట్ట వద్ద పక్కా పక్క ప్లాన్ తో అక్కడికి ఇజ్రాయిల్ రప్పించిన దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్లతో దాడి చేసి  విచక్షణ రహితంగా నరికారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు ఇజ్రాయిల్ ను  గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి మరింత విషమించడంతో కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. వైసీపీ పార్టీ నేత అయిన ఇజ్రాయిల్ పై దాడి జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: