ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.  రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఈ వైర‌స్ మహమ్మారి మ‌రింత‌గా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో తాజా క‌రోనా హెల్త్ బులిటెన్ ను ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసింది. ఈ బులిటె న్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 73 కోరోనా కేసులు న‌మోద‌య్యాయి.  గడచిన 24 గంటల్లో (మంగ‌ళ‌‌వారం ఉదయం 9:00 గంటల నుంచి బుధ‌వారం ఉదయం 9:00 గంటల వరకు) వివిధ జిల్లాల్లో న‌మోదైన కేసుల‌ను హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 

 

కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే కొత్త‌గా మ‌రో 53 కేసులు నమోద‌య్యాయి. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదుకాలేద‌‌ని ఏపీ ఆరోగ్య శాఖ హె ల్త్ బులెటిన్ వెల్లడించింది.  కాగా కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332కు చేరుకుంది. ప్ర‌స్తుతం 1014 మంది దవాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 287 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. క‌రోనా బారిన ప‌డి 31 మంది చ‌నిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: