క‌రోనా దెబ్బ‌తో పెళ్లిళ్ల అర్థాలే మారిపోయాయి. ఒక చోట పెళ్లి తంతు జ‌రుగుతుంటే ఎక్క‌డిక‌క్క‌డ బంధువులు వీడియోలో మాత్ర‌మే పెళ్లి చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు అమెరికాలో పెళ్లి తంతు జ‌రుగుతుంటే అక్క‌డ‌కు వెళ్ల‌లేని బంధువులు ఇక్క‌డ ఆన్‌లైన్లోనూ అక్షింత‌లు వేసి దీవిస్తుంటారు. ఇప్పుడు క‌రోనా పుణ్య‌మా ? అని పెళ్లంటే వ‌ధూవ‌రులు ప‌క్క‌న ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. జూమ్ యాప్‌లో లేదా ఆన్‌లైన్ వీడియో కాల్స్‌లోనో ఎక్క‌డో జ‌రిగే పెళ్లి తంతు చూస్తున్నారు.

 

తాజాగా కేర‌ళ‌లో ఓ విచిత్రం జ‌రిగింది. ఓ జంట ఆదివారం నాడు ఫోన్‌లోనే పెళ్లి కానిచ్చేసింది. ఇందుకోసం కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్‌.. అల‌ప్పుజాలో‌ వ‌ధువు అంజ‌నా బంధువు ఇంటికి వెళ్లాడు. అక్క‌డ వ‌ధువు తండ్రి ఉండ‌గా, పెళ్లికూతురు, ఆమె త‌ల్లి, సోద‌రుడు ల‌క్నోలో ఉన్నారు. వీరు పెళ్లికి ముందుగా ఆదివారం 12 గంట‌ల‌కు ముహూర్తం అనుకున్నారు. ముహూర్తం టైంకు వ‌ధూవ‌రులిద్ద‌రూ పెళ్లి బ‌ట్ట‌లు ధ‌రించి ఫోన్‌లో లైవ్‌లోకి వ‌చ్చారు. వెంట‌నే తాళిబొట్టు చేత‌ప‌ట్టుకుని వ‌రుడు ఫోన్‌కు వెన‌క‌వైపున క‌ట్టాడు. 

 

అటు వ‌ధువు త‌ల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. ఈ తంతు చూసిన జ‌నం షాక్ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత రిసెప్ష‌న్‌తో పాటు వివాహ రిజిస్ట్రేష‌న్ జ‌రుపుతార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: