తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అతను మరణించాడంటూ కొన్ని అసత్య కథనాలు వెలువడటంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతనింకా చనిపోలేదంటూ, చావుతో పోరాడుతున్నాడని స్పష్టం చేశారు. ఇర్ఫాన్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు తమను తీవ్రంగా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వదంతులు సృష్టిస్తూ అభిమానుల్లో అనవసర భయాందోళనలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. దయచేసి ఎవరూ వీటిని నమ్మవద్దని కోరారు.
ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అతని తల్లి సైదా బేగం శనివారం మృతి చెందారు. అటు లాక్డౌన్తోపాటు ఇటు అతని ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్లోనే తల్లిని కడసారి చూసుకున్నాడు.