టిక్టాక్ ద్వారా యువతికి ఓ యువకుడి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. దీంతో అతగాడి కోసం 200 కిలోమీటర్లు నడిచి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తంజావూరు ప్రాంతానికి చెందిన యువతికి టిట్టాక్ ద్వారా మదురై ఆరపాలయంకు చెందిన యువకుడితో పరిచయమైంది. ఆమె.. అతడిని వన్సైడ్గా ప్రేమించింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆమెతో టిట్టాక్ చేయడాన్ని నిలిపివేశాడు. అయినా ఆమె మాత్రం అతనిపై ప్రేమను పెంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్తో 144 సెక్షన్ అమలులో ఉన్నా.. ఆ యువకుడిని చూడడానికి ఆమె మదురైకు నడిచి వస్తున్నట్టు టిక్టాక్ ద్వారా వీడియో పెట్టింది. తంజై నుంచి మదురైకి సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంది. ఒంటరిగా నడిచి వస్తూ,ప్రేమ పాటలు పాడుతూ..ఏ ప్రాంతంలో ఉందో తెలిసే విధంగా వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.