లాక్ డౌన్ కారణంగా ప్రజల జీవన విధానం మారిపోయింది. అయితే ఈ సమయంలో వీడియో కాల్స్ ప్రాముఖ్యత పెరిగింది. పాఠశాలలు మరియు కార్పొరేట్ సంస్థలు తమ సేవలను రిమోట్ సెన్సిన్గ్ ద్వారా తమ సేవలను అందించా మొగ్గుచూపుతున్నాయి. అయితే జూమ్ ఆప్ ద్వారా సుమారు 10 మిలియన్ల 300 మిల్లియన్లకు వీడియో సేవలు పెరిగినట్లు జూమ్ సంస్థ గుర్తించింది. అయితే పెరుగుతున్న అవసరాల దృష్ట్యా డేటా సెక్యూటిరీ ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని జూమ్ సంస్థ గుర్తించింది.
భద్రతా సమస్యలను పరిష్కరించడానికి జూమ్ 90 రోజుల ప్రణాళికను రూపొందించింది, అయితే ఈ సమయంలో, ట్రాఫిక్లో ముప్పై రెట్లు పెరగడానికి ఎక్కువ కంప్యూటింగ్ శక్తి అవసరం.ఈ కారణాల వల్ల జూమ్ సంస్థ ఒరాకిల్ తో క్లౌడ్ టెక్నాలజీ పరంగా ఒప్పందం కుదుర్చుకుంది. అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించకపోయినా ఇప్పటికే ఒరాకిల్ జూమ్ కోసం పని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె జూమ్ నుండి క్లౌడ్ టెక్నాలజీని కి సంబంధించి ప్రాజెక్ట్ పొందడం సంతోషంగా ఉందని ఒరాకిల్ తెగ చంకలు కొట్టుకొంటుంది .
Oracle wins cloud computing deal with Zoom as video calls surge https://t.co/dvRQURJoJZ pic.twitter.com/bzgBBOLmtg
— Reuters (@Reuters) April 29, 2020