బాలీవుడ్‌ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుత స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ (67) తాజాగా కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు.  రిషికపూర్ అనారోగ్యం పాలవడంతో అతన్ని బుధవారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం ఆయ‌న క‌న్నుమూశారు. రిషీ 2018 లో క్యాన్స‌ర్ భారీన ప‌డ్డారు.

 

అప్ప‌టి నుంచి అమెరికాలో చికిత్స పొందుతోన్న ఆయ‌న అక్క‌డ చికిత్స అనంత‌రం ముంబైకు వ‌చ్చారు. తాజాగా అనారోగ్యానికి గురి కావ‌డంతో ఆయ‌న్ను ముంబైలోని హెచ్ ఎన్ రియ‌ల‌న్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందారు. రిషికపూర్ వెంట అతని భార్య నీతూకపూర్ ఉన్నారని రణధీర్ కపూర్ చెప్పారు. ఏడు ప‌దుల వ‌య‌స్సులోనూ రిషీ క‌పూర్ ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు. ఈ వ‌య‌స్సులోనూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు.

 

ఈ మార్చిలో సైతం ఆయ‌న లాక్‌డౌన్ సంద‌ర్భంగా యోగా చేస్తోన్న ఫొటోను ఆయ‌న స‌తీమ‌ణి నీతూక‌పూర్ పోస్ట్ చేశారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైన ఆయ‌న బాబీ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో పాటు కొన్ని ప్ర‌జాదార‌ణ పొందిన వెబ్‌సీరిస్‌ల‌లో కూడా న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: