బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ దిగ్గజనటుడు రిషికపూర్ కన్నుముశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న రిషి కపూర్ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిషికపూర్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు టాలీవుడ్తో విడదీయరాని అనుబంధం ఉంది. మన అందాల తార శ్రీదేవితో ఆయన చాందిని సినిమాలో నటించారు. ఈ సినిమాను పరమేశ్వరి - మహేశ్వరి ఆర్ట్స్ బ్యానర్పై తిక్కవరపు సుబ్బరామిరెడ్డి నిర్మించారు.
ఇక కళాతస్వి సిరిసిరి మువ్వ ను బాలీవుడ్లో స్వర్గం పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా టైంలో కళాతపస్వితో ఆయనకు ఎనలేని సంబంధం ఏర్పడింది. ఇక తాజాగా రిషి మృతిపై కె. విశ్వనాథ్ స్పందిస్తూ తాను షూటింగ్ సెట్లోకి 10.30 గంటల వరకు రాను... ఆ తర్వాత నన్ను రాత్రి ఎప్పటి వరకు అయినా వాడుకోవచ్చు అని నిర్మొహమాటంగా చెప్పేవారని చెప్పారు. ఆ తర్వాత చాలా యేళ్లకు కె. విశ్వనాథ్ స్వర్ణకమలం సినిమా చేస్తోన్న టైంలో కశ్మీర్లో కలిశాము అదే స్నేహం.. అదే ప్రేమ చూపించారని నాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు.