కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ వ్యవస్థలు అన్ని బ్రేక్ అయిపోయాయి. ఇక ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ కోరుకునే సినీ లవర్స్ అయితే థియేటర్లలో సినిమా చూసేందుకు మొఖం వాచిపోయి ఉన్నారు. అసలు మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో ? కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ? తెలియక వెయిట్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేసేవారి బాధలు అన్నీఇన్నీ కావు. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేకపోవడంతో కొన్ని సినిమాలను ఓటీటీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీపై విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. థియేటర్లలో ఎలాగూ ఇప్పట్లో విడుదల చేయలేం కనుక ఓటీటీలో అయినా విడుదల చేద్దామనే ఉద్దేశ్యంతో కొందరు నిర్మాతలు ఓటీటీ రిలీజ్కు సిద్దం అవుతున్నారు. ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా అమృతరామన్. ఇక ఇప్పుడు కోలీవుడ్లో మరో సినిమా ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోంది. వెంకట్ ప్రభు నిర్మాతగా శరవణరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్కేనగర్ రిలీజ్కు రెడీ అయ్యింది.
ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వైభవ్ హీరోగా నటించిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అసలు ముందుగా జ్యోతిక నటించిన పొనమగళ్ వందాళ్ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుందని అనుకోగా... ఇప్పుడు దానికంటే ముందే ఈ సినిమా వస్తోంది.