బాలీవుడ్ సినీ దిగ్గజం మరియు లెజెండ్ రిషీ కపూర్ మరణ వార్త యావత్ భారత దేశాన్ని దుఃఖ సాగరంలో ముంచి వేసింది. ఇందులో భాగంగా సినీతారలు చిరంజీవి , కేటీఆర్ , అమితాబ్ బచ్చన్ , పవన్ కళ్యాణ్ , ప్రియాంక చోప్రా, రజని కాంత్ , కియారా అద్వానీ మరియు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేశారు. రిషీ కపూర్ 1954 సెప్టెంబర్ 4 న జన్మించారు .ఇప్పటి వరకు అనేక సినిమాలలో ఆయన నటించారు, మరియు అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అనేక సినిమాలకు డైరెక్టర్ గా కూడా పనిచేసారు. టాలీవుడ్ నుండి ఆయన మృతి పట్ల పలువురు సినీ తారలు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన ట్విట్టర్లో స్పందించారు ...'' సినీ పరిశ్రమలో ఒక బాల్య నటుడిగా ,యువ కథానాయకుడిగా ,నటుడిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంకిత భావంతో నటించిన నటుడు.. సుదీర్ఘమైన మరియు ఉత్తేజకరమైన ప్రయాణం ముగింపుకు వస్తుంది ... గొప్ప సినిమాలు కూడా “ది ఎండ్” నుండి తప్పించుకోలేవు'' ..హరీష్ శంకర్ !!
A child artist to youth heartthrob to star to a character actor all his life dedicated and lived for CINEMA..... a long and inspiring journey Comes to an end... even the great movies can’t escape “The End” pic.twitter.com/mU2k89GXLu
— harish shankar .S (@harish2you) April 30, 2020