లాక్‌డౌన్ కారణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ప్ర‌జ‌ల‌ను బాగా ఆక‌ట్ట‌కుంటున్న చానెల్ ఏదైనా ఉందంటే.. అది క‌చ్చితంగా ఈటీవీయేన‌ని చెప్పొచ్చు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా కంటెంట్‌, అద్భుత‌మైన కాన్పెప్ట్‌ల‌తో నిత్య‌నూత‌నంగా ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోతోంది. తాజాగా.. మ‌రో వైవిధ్య సీరియ‌ల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నట్టుగా ఈటీవీ వారు అధికారికంగా తెలిపారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ హీరోగా నటించిన కొన్ని అద్భుత చిత్రాల్లో *యమలీల* ఒకటి. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1994 లో విడుదలై సంచ‌ల‌న విజ‌యం అందుకుంది. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. దాని తర్వాత 2014లో సీక్వెల్ కూడా వచ్చింది.

 

కానీ ఇప్పుడు ఇదే సినిమాను *యమలీల ఆ తర్వాత* అనే సీరియల్‌గా మలచి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మరోసారి మంత్రముగ్ధులను చేసేందుకు వ‌స్తోంది. అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇందులో ఆలీ మెయిన్ లీడ్ లో కనిపించబోతున్నాడు. ఇక‌ ఈ సీరియల్ లో యముని పాత్రలో యాక్షన్ హీరో సుమన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన‌ ఈ ప్రోమోలు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే.. సోషల్ మీడియా యూజర్లకు కూడా తెలిసేలా మూడు ప్రోమోలను ఈటీవీ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పెట్టారు. త్వ‌ర‌లోనే ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కానుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: