ఏపీ లో చోటుచేసుకున్న కొన్ని కీలక పరిణామాల వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇప్పటికే మంత్రి మేకపాటి గౌతమ్  రెడ్డికి మరో రెండు శాఖలను అప్పగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇప్పటికే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు ,ఐటీ మరియు వాణిజ్యం వంటి శాఖలను నిర్వర్తిస్తూ ఉండగా ఇప్పుడు కొత్తగా ఆయనకు పెట్టుబడులు మరియు మౌలిక వసతులు శాఖలను వైఎస్ జగన్ అప్పగించారు.

 

IHG

 

వైఎస్ కుటుంబానికి మరియు మేకపాటి కుటుంబానికి మంచి సంబంధాలు వైఎస్ఆర్ హయాంనుండి కొనసాగుతుండగా. వైఎస్ అనంతరం మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కి అనుచరుడిగా ఉన్నాడు. గౌతమ్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గం నుండి రెండు సార్లు గెలిచాడు ..ప్రస్తుతం పరిశ్రమలు , ఐటీ మరియు వాణిజ్య శాఖలను మంచిగా నిర్వర్తిస్తూ ఉండడంతో వైఎస్ జగన్ మెచ్చి మౌలిక వసతులు మరియు పెట్టుబడులు అనే రెండు శాఖలను అప్పగించినట్లు వెల్లడించారు 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: