కరోనా మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్ధీక వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు మరియు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మృతదేహాలను భద్రపరచడానికి మార్చరీలు కూడా సరిపోవడం లేదు. ప్రపంచ పెద్దన్న అమెరికా లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా విరుగుడు కోసం వ్యాక్సిన్ లను కనిపెట్టే ప్రయత్నం లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 3,26,1641కు చేరింది. ఇప్పటివరకు కరుణ బారినపడి 2,30,388మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ 10,29,477మంది కోలుకున్నారు. భారత్ లో ఇప్పటి వరకూ 33,610 కరోనా కేసులు నమోదయ్యాయి.. ఇందులో దాదాపుగా 8373 మంది ప్రాణాలు కోల్పోగా... 5914 మంది కోలుకున్నారు.