క‌రోనా విష‌యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య వార్ న‌డుస్తూనే ఉంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఈ విష‌యంలో మిగ‌తా రాష్ట్రాల‌కు ఏపీ ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉన్న‌ద‌ని అంటున్నారు. అయితే.. చంద్ర‌బాబు మాత్రం ఈ విషయాన్ని అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు.. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ విఫ‌లం చెందుతోంద‌ని.. లేఖ‌ల‌మీద లేఖ‌లు విడుద‌ల చేస్తున్నారు.. చెప్పిందే ప‌దేప‌దే చెబుతున్నారు. ఇక వైసీపీ నేత‌లు కూడా బాబోరికి గ‌ట్టిగానే స‌మాధానం చెబుతున్నారు.

 

అందులోనూ వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాత్రం మ‌రో అడుగుముందుకేసి.. చంద్ర‌బాబును ఏకిపారేస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు సూటిగా ప్ర‌శ్నిస్తూ.. చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా.. చంద్ర‌బాబుపై మ‌రో ట్వీట్ చేశారు.. *శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలి. కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో దిక్కుతోచడం లేదాయనకు. వాటినీ దాస్తున్నారని బురద కుమ్మరించడానికీ సిగ్గుపడడు. 2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఆంధ్రానే. ఇలాంటివి కనిపించవు* అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక దీనిపై బాబోరు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: