తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. శుక్రవారం నమోదైన 6 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 24 మంది బాధితులు ఇవాళ డిశ్చార్జి అయ్యారు. వాస్తవంగా తెలంగాణలో ముందు నుంచి ఉన్న పరిస్థితులు చూస్తే కరోనా కేసులు అక్కడ విజృంభిస్తూ పెరిగిపోవాలి.
అయితే సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడంతో కరోనా కేసుల వ్యాప్తి చాలా తక్కువుగా ఉందనే చెప్పాలి. ఇక మంత్రి ఈటల మాట్లాడుతూ కరోనా టెస్టులు చేయకపోవడం వల్లే తక్కువ కేసులనే ఆరోపణలు నిజం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని ఐసీఎంఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏ