ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో మే 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతోన్న లాక్ డౌన్ ఇప్పుడు పొడిగించారు. ఇక ఇప్పుడు మ‌రో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించిన సంగ‌తి తెలిసిందే. జోన్ల వారీగా కొన్ని ప‌రిమితుల‌తో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇదిలా ఉంటే గ్రీన్‌జోన్ల‌లో చాలా వ‌ర‌కు నిబంధ‌న‌లు స‌వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌జారవాణాకు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక గ్రీన్‌జోన్ల‌లో ఆర్టీసీ బ‌స్సుల‌కు కూడా ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌నున్నారు. అయితే బ‌స్సులో కూడా సోష‌ల్ డిస్టెన్స్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. 50 శాతం సీట్ల సామర్థ్యంతో బస్సులు ప్రయాణించవచ్చు. ఈ ప్ర‌జారవాణ ఇత‌ర రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు, దూర ప్రాంతాల‌కు వెళ్లేవారికి పెద్ద వెసులు బాటే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: