దేశంలో లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు నానా కష్టాలు పడ్డారు. ఈ నేపథ్యంలో వారికి స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం పరిమిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో  రాష్ట్రాలతో మాట్లాడి నిత్యం శ్రామిక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు రైళ్ల రాకపోకలు అందుబాటులో ఉండాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించింది. అయితే డీఎం, డీఆర్‌ఎంలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని వివరించింది.  రైళ్లు నడిపే అధికారాన్ని జోనల్ రైల్వే అధికారులకే ఇచ్చినట్లు వెల్లడించింది.   

 

దేశంలో లాక్ డౌన్   ప్రారంభం అయినప్పటి నుంచి కొన్ని చోట్ల కూలీలు నానా యాతనలు పడ్డారని.. వారి కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.  ఇప్పుడు వలస కూలీల తరలింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను సొంత ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే అధికారులు రైల్వే స్టేషన్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి స్వస్థలాలకు చేరుకున్న తర్వాత పరిస్థితులను బట్టి క్వారంటైన్ లో ఉంచండని తెలిపారు. సామాజిక దూరం నిబంధనను పాటిస్తూనే కూలీలను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: