రిషి కపూర్, నీతూ దాదాపుగా 15 చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే ప్రేమలోపడి 1980లో వివాహ బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు. వీరికి రణబీర్ కపూర్, రిథిమాకపూర్ సంతానం. రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు కాగా, రిద్ధిమా డిజైనర్గా స్థిరపడింది. అయితే రిషీ కపూర్ గత రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతుండగా, ఆయనని నీతూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మూడో బిడ్డలా రిషీని చూసుకుందని పలువురు అంటుంటారు.
*తినిపించడం, పడుకోబెట్టడం, మందులు ఇవ్వడం.. ఇలా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకున్నా. ట్రీట్మెంట్ సమయంలో ఆయన అస్సలు తినేవారు కాదు. అది నన్ను చాలా బాధించింది. దీంతో ఆయన తినడం కోసం చాలా ట్రిక్స్ ప్లే చేశా* అని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నీతూ. అయితే ఇటీవల రిషీకపూర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఒంటరిగా కాలంగడుపుతున్న నీతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్లో రిషీ చేతిలో మందు గ్లాసు పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ... ఇక మన కథ ముగిసిందంటూ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా ఎమోషనల్గా ఫీలవుతూ కామెంట్స్ పెడుతున్నారు.