IHG

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ లో మేనమామ  మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ను నిలబెడుతూనే ఉన్నాడు. ఈ సుప్రీమ్ హీరో చేసిన మొదటి రెండు సినిమాలతోనే అదిరిపోయే వెల్కమ్  అందుకున్నాడు. సాయి ధరంతేజ్ కు సుప్రీమ్ సినిమా  ఓ రేంజ్ హిట్ ని అందించింది. తర్వాత సుప్రీం సినిమా అంత రేంజిని 'ప్రతి రోజు పండగే' సినిమా ద్వారా సాయి ధరంతేజ్ తిరిగి అందుకున్నాడు .

 

 

ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కి జోడిగా రాశి ఖన్నా చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ మధ్య తొలిసారిగా  టెలికాస్ట్ చేయగా అదిరిపోయే టీఆర్పీని   దక్కించుకుంది. అయితే సందర్భంగా 15 టీఆర్పీ  పాయింట్లను మొదటిసారిగా టెలికాస్ట్ కి వచ్చినట్లు ఆ సినిమా దర్శకులు ప్రకటించారు. కానీ మళ్లీ రెండోసారి కేవలం 4.7 రేటింగ్ మాత్రమే వచ్చినట్లు ఇప్పుడు సమాచారం. ఇంత భారీ మార్పును చూడడం ఆ సినిమా మేకర్స్ కి వంట పట్టడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: