కరోనా వైర‌స్ గురించి రోజురోజుకూ కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.. వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తి.. త‌దిత‌ర అంశాలు తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఇన్నిరోజుకూ క‌రోనా వైర‌స్‌ సోకిన బాధితులు తుమ్మడం, దగ్గడం వల్ల వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుందని ఇప్పటిదాకా అంద‌రికీ తెలుసు. కానీ, తాజాగా.. మ‌రో విష‌యం వెలుగుచూసింది. చివ‌రికి మురుగునీటి వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని కర్ణాటకలోని ప్రముఖ పర్యావరణవేత్త యల్లప్పరెడ్డి చెప్పారు. బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్తలు నిర్మలగౌడ, డాక్టర్‌ నిధి పలివాల్‌ తదితరులతో కలిసి ఆయన నగరంలో పరిశోధనలు చేశారు.

 

మురుగునీటిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు వారు గుర్తించారు. బెంగళూరులోని మురుగునీరు వృషభారతి, అర్కావతి నదుల్లో కలుస్తోంది. పాదరాయనపుర, బాపూజీనగర వార్డులో ఎక్కువ మంది కరోనా వైర‌స్ బాధితులు ఉన్నారు.  ఇక్కడి డ్రైనేజీ నీరు నేరుగా వృషభావతి నదిలోకి వెళ్తోంది. కరోనా బాధితుల నుంచి వైరస్‌ తొలుత మురుగు నీటి, అక్కడి నుంచి నదిలో చేరుతోందని యల్లప్పరెడ్డి పేర్కొన్నారు. ఈ విష‌యం వెలుగుచూడ‌గానే ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: