ఊరిలో పెద్దలను ఒప్పించి తానూ ప్రేమించిన వాడినే పెళ్లిచేసుకుంది ఆ యువతీ . పెళ్లి అయ్యి మూడురోజులు కూడా కాకమునుపే ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన తమిళనాడు లోని వెళూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వేలూర్ జిల్లా కేవీకుప్పం వడంగంతాంగళ్ అంజుతంనగర్కు చెందిన ఓ యువతి(20), అదే ప్రాంతానికి చెందిన శంకర్ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.అయితే మొదట్లో వారి తల్లితండ్రులు ఆ వివాహానికి నో చెప్పినప్పటికీ మళ్లీ వారు తమ మనసు మార్చుకొని వారిరువురికి పెళ్లి చేయాలనీ అనుకున్నారు.
పెద్దలు అంగీకారం తెలపడంతో ఏప్రిల్ 29న సన్నిహితుల మధ్య నిరాబండరంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.అయితే ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం నాడు ఆ యువతీ తాను ఉంటున్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పెద్దలు ఆ గది తలుపులు తెరచి వెళ్లి చూసేసరికి ఆమె గదిలోని ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను వెంటనే కేవీకుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని ఆ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మృతదేహాన్ని గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.