బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. బాల సుందరం (38) కింగ్ కోఠిలోని ఆంధ్రా బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఉప్పల్లోని సౌత్ స్వరూపానగర్లో నివాసముంటున్నాడు. ఈ తెల్లవారుజామున బాల్కనీ హుక్కుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాలనీలో కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాగా తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖలో బాల సుందరం పేర్కొన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు. అయితే బాల సుందరం ఆత్మహత్యపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు.