టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా పరిచయం అయినా పంజాబీ బ్యూటీ కాజాల అగర్వాల్. తెలుగులో చాల హిట్ సినిమాలలో నటించింది. ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. లాక్ డౌన్ సందర్భంగా సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. రోజురోజుకు తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తాను బాద్ షా సినిమా చేసిన టైం లో తీసిన ఓ ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో డైరెక్టర్స్ శ్రీను వైట్ల , పూరి జగన్నాథ్ హీరోలు బన్నీ, jr ఎన్టీఆర్ లు మరియు తాను అమలా పాల్ తో కలసి ఉన్న ఫోటో ని సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఆ ట్వీట్ లో వారందరిని మరోసారి చూసేవరకూ వెయిట్ చేయలేనని ...వారిని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుందని ...ఆఫొటో ద్వారా ట్వీట్ చేసింది.....ప్రస్తుతం వీరి కాంబోలో సినిమా వస్తుందంటే అభిమానులకు కూడా ఆసక్తిగా ఉంది...
@SreenuVaitla @purijagan @alluarjun @tarak9999 @Amala_ams Look what I found 😍#baadshah #iddarammayilatho catch up in Barcelona. Can’t wait to see you all again! 🤗❤️ pic.twitter.com/97ktCSMGxX
— kajal aggarwal (@MsKajalAggarwal) May 3, 2020