ఆక‌ర్ష‌ణ అనే వ‌ల‌లో ప‌డితే ఎన్నో జీవితాలు నాశ‌నం అయిపొతున్నాయి. ఈ ఆక‌ర్ష‌ణ‌ల వ‌ల్ల వివాహేత‌ర సంబంధాలు ఏర్ప‌డి ముక్కు ప‌చ్చ‌లార‌ని జీవితాలు నాశ‌నం అవుతున్నాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌ర‌రుగుతున్నా.. ఎంతో మంది మోస‌పోతున్నా క్ష‌ణికావేశంలో సుఖం చేసే త‌ప్పులు ప‌దే ప‌దే చేస్తూనే ఉంటున్నారు. తాజాగా భ‌ర్త వేధింపులు భ‌రించ‌లేని క్ర‌మంలోనే ఓ యువ‌కుడి వ‌ల‌లో ప‌డిన ఓ యువ‌తి మ‌రో యువ‌కుడి చేతిలో దారుణంగా మోస‌పోయింది. రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జ‌రిగిన ఈ సంఘ‌టన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

 

జోధ్‌పూర్‌లోని మ‌హ‌మండీర్ ప్రాంతానికి చెందిన ఓ యువ‌తికి అదే ప్రాంతానికి చెందిన యువ‌కుడితో కొద్ది రోజుల క్రితం పెళ్ల‌య్యింది. అయితే ఆమెకు భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకోవాన్న నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన మ‌రో యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. భ‌ర్త‌తో ఆమె దూరంగా ఉంటున్న విష‌యాన్ని అలుసుగా తీసుకున్న స‌ద‌రు యువ‌కుడు ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఆమెను లోబ‌ర‌చుకుని లైంగీకంగా వాడుకున్నాడు. 

 

ఈ క్ర‌మంలోనే ఆ యువ‌కుడి మాట‌లు న‌మ్మిన ఆ యువ‌తి భ‌ర్త‌కు విడాకులు కూడా ఇచ్చింది. ఆ త‌ర్వాత క‌థ అడ్డం తిరిగింది. ఆ యువ‌కుడు ఆమెను పెళ్లి చేసుకోన‌ని చెప్పేశాడు. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన యువ‌తి చివ‌ర‌కు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేశ్ తనను పెళ్లి చేసుకునంటానని నమ్మించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, మోజు తీరాక మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: