కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీహా ర్కు చెందిన రాహుల్ (30), రాణి (26) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఈక్రమంలోనే బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు.
నగరంలోని మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపుర ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని జీవినం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా దంపతులిద్దరూ 40 రోజులు పాటు ఇంటికే పరిమితం అయ్యారు. ఈక్రమంలోనే శుక్రవారం ఉదయం భార్యభర్తలు ఇద్దరు తమ గదిలో ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. కరెంట్ బిల్లు ఇచ్చేందుకు ఇంటి యజమాని వారి గదికి వెళ్లిన సమయంలో దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.