'ఓ మై కడవులే' సినిమా తో పెద్ద సక్సెస్ను అందుకున్న యువ హీరో అశోక్ సెల్వన్. ప్రస్తుతం లాక్ డౌన్ లో కొత్తకథలను ఎంచుకొనే పనిలో పడ్డాడు. అయితే కొన్ని కథలను సెలెక్ట్ చేశాడు. అందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ కథ నచ్చడంతో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఆ సినిమాకి ఓ లేడీ డైరెక్టర్ దర్శకత్వం వహించనుంది.. ఆ డైరెక్టర్ పేరు స్వాతిని. ఈమె గతం లో ఎన్నో హిట్ సినిమాలను అందించిన సుశీంథిరన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.
ఈ సినిమా కోసం నిహారిక కొణిదెల ను సెలెక్ట్ చేసినట్లు తమిళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈమె ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన 'ఓరు నల్ల నాల్ పాత్తు సోల్రేన్ ' లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా లాక్ డౌన్ తరువాత సెట్స్ మేతకు తీసుకువెళ్లాలని నిర్మాణ వర్గాలు చెబుతున్నారు.
Yes and yes! I’m super excited and can’t wait for the shoot to start! ⭐️😁
— niharika konidela (@IamNiharikaK) May 3, 2020
My next! With @AshokSelvan
Directed by @iam_swathini
Produced by @Kenanya_Off
Music by @leon_james pic.twitter.com/v0BnYLGyl1