లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్నారు. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ అంజలి తాను నటించిన ఓ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నిశ్శబ్దం సినిమా చిత్రీకరణలో భాగంగా చివరి రోజు తీసుకున్న ఫోటో ఇది’ అని ఆమె కామెంట్ జత చేశారు. ఈ ఫోటోలో.. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క ముఖానికి, మరో నటుడు సుబ్బరాజు ముఖానికి రక్తం మరకలు ఉండటం గమనించవచ్చు.
‘నిశ్శబ్దం’ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్కు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందింన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ‘నిశ్శబ్దం’ వాయిదా పడింది.