మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌... ఈ సినిమాపై మ‌రో కొత్త వార్త ప్ర‌చారంలో కి వ‌చ్చింది. ఈ సినిమా నుంచి త్రిష త‌ప్పుకున్న త‌ర్వాత కాజ‌ల్ ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె కూడా మూవీ నుంచి త‌ప్పుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. త‌మిళ సినిమాకు ఎక్కువ డేట్స్ కావాల్సి ఉండ‌టంతో ఆమె ఆచార్య‌ను వ‌దులుకున్నార‌ని టాక్ వినిపించింది. అయితే  ఈ ప్ర‌చారానికి కాజ‌ల్ ప్ర‌తినిధులు చెక్ పెట్టారు. కాజ‌ల్ ఈ సినిమా నుంచి త‌ప్పుకోలేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. 

 

ఆచార్య సినిమాకు కాజ‌ల్ ఎప్పుడో ఒప్పుకున్నార‌ని, అంతేగాక చిరు సినిమాకు అడ్వాన్స్ కూడా తీసుకున్నార‌ని వారు తెలిపారు. లాక్‌డౌన్ త‌ర్వాత షూటింగ్ ప్రారంభిస్తే... కాజ‌ల్ నేరుగా సెట్‌కు వెళ‌తార‌ని తేల్చి చెప్పారు. దీంతో ఇక ప్ర‌చారానికి తెర ప‌డిన‌ట్ల‌యింది. కాగా కాజ‌ల్ గతంలో చిరంజీవితో ఖైదీ నంబ‌ర్ 150వ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: