వైద్యులు, న‌ర్సులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులను నేడు ప్ర‌పంచ‌మంతా నిజ‌మైన హీరోలుగా చూస్తోంది. ప్రాణాల‌కు తెగించి, క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు, నిరంత‌రం ప‌రిసరాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య సిబ్బంది, రాత్రింబ‌వ‌ళ్లు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న‌పోలీసుల సేవ‌ల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సామాన్యులేకాదు.. సెల‌బ్రిటీలు.. అన్నివర్గాలు వారికి జేజేలు ప‌లుకుతున్నాయి. ఈరోజు ఏకంగా భార‌త త్రివిద ద‌ళాల ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ కొవిడ్ ఆస్ప‌త్రుల‌పై పూల‌వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే.

 

వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిపై పూల‌వ‌ర్షం కురిపించి స‌లాం చేశాయి త్రివిద ద‌ళాలు. తాజాగా.. టాలీవుడ్ టాప్ హీరో వెంక‌టేశ్ కూడా వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసుల సేవ‌ల‌ను కొనియాడారు. వారే నిజ‌మైన హీరోల‌ని ట్వీట్ చేశారు. వారిని మ‌నం గౌర‌వించాల‌ని, ఈ యుద్ధంలో వారంద‌రూ గెలిచి క్షేమంగా రావాల‌ని కోరారు. వారి సేవ‌ల‌కు తాను సాక్ష్యంగా ఉండ‌డంతో ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని వెంక‌టేశ్ భావోద్వేగానికి గుర‌య్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: