ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఇప్పటికే తెలుగు లో పలు హిట్ చిత్రాలలో నటించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో తన గ్లామర్ ను విశాల పరచింది. కానీ ఆ చిత్రం ,చిత్రం గానే మిగిలి పోవడంతో ఈ అమ్మడు బావురుమంటుంది. అయినప్పటికీ కొన్ని కోలీవుడ్ సినిమాలతో బిజిగా ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఆ సినిమాలు కాస్త సెలవులు ప్రకటించాయి.
దింతో ఈ బొద్దు గుమ్మా సోషల్ మీడియా పై పడింది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటోంది. అభిమానులు అడిగే అన్ని ప్రశ్నలకు విస్తుపోకుండా సమాధానం ఇచ్చే పనిలో పడింది అయితే ఒకానొక సందర్భంలో అభిమాని అడిగిన ప్రశ్నమీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటని అభిమాని అడుగగా ప్రస్తుతం తమిళంలో సెంథిరన్ 3 మరియు హీరో సూర్యతో ఓ ప్రాజెక్ట్ ను హరి డైరెక్షన్ లో చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తెలుగు లో ఓ రెండు ప్రాజెక్టులు డిస్కార్షన్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ తో కంగు తిన్న ఈ అమ్మడు ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది ...
Aranmanai 3 and a film with Suriya sir under hari sir’s direction in Tamil.. Will give more clarity about two projects in telugu that are under discussions, once the lockdown is over ☺️ https://t.co/sSIESmG3FJ
— Raashi (@RaashiKhanna) May 3, 2020